English Translated
Tuesday, March 23, 2021
"నమస్కారం" ప్రాముఖ్యత
Monday, March 8, 2021
ప్రాణము- ప్రాణాయామము
మన శరీరంలో ఆలోచనలు దగ్గర నుండి ప్రతి క్రియ జరగడానికి మూలం ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి శరీరంలో ఉన్న 72000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ఆధారంగా నే ప్రాణం ఉంటుంది శరీరంలో. శరీరం, మనస్సు రెండింటి నీ అనుసంధానం చేసేది కూడా ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి లయబద్ధంగా పని చేస్తూ ఉంటే మిగిలిన వి అన్ని చక్కగా పని చేస్తాయి. శ్వాస ద్వారా ప్రాణశక్తిని నియంత్రించవచ్చు. శ్వాస ఆధారంగా చేసే ప్రక్రియ ప్రాణాయామము. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగ లో నాలుగవది ప్రాణాయామము. ప్రాణాయామము అనగా ప్రాణ+ ఆయమము. ప్రాణశక్తిని ఉద్దీపింప చేయడమే ప్రాణాయామము.మన శరీరంలో ఉన్న 3 ప్రధాన నాడు లు సూర్య నాడి, చంద్ర నాడి, సుషుమ్న నాడి.
ప్రాణాయామ సాధన వలన కలిగే ప్రయోజనాలు:
* రక్తము శుద్ధి జరిగి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.* ఊపిరితిత్తులు, గుండె, మెదడు అన్ని అవయవముల పనితీరు మెరుగుపడుతుంది.* నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.* ఒత్తిడి తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది.* వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.* జీర్ణక్రియ మెరుగవుతుంది.
Friday, February 26, 2021
శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం - అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము
"శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం" అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము
అని చరకసంహిత అనే ఆయుర్వేద గ్రంథం లో చెప్పబడినది. ఈ శరీరమే మనం జీవించి ఉన్నంత కాలం మన వాహనం , కావున శరీరాన్ని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది.
దేహమే దేవాలయం అంటారు కదా, కాబట్టి శరీరం ఆరోగ్యంగా, చైతన్య వంతంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు, యోగాభ్యాసం, సత్యవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి. ఈ జీవన విధానం అలవరచుకోవడానికి మనము ముఖ్యం గా పాటించవలసినవి 4 నియమాలు ఆహార్, విహార్, ఆచార్, విచార్.
ఆహారం విషయానికి వచ్చేసరికి. మనము తినే ఆహారం బట్టి మనం శరీరం పనితీరు ఉంటుంది.కాబట్టి మనం తినే ఆహారం లో పోషక విలువలు గమనించాలి. తాజాగా వండిన వాటిని తినాలి. ఆహారం నోట్లో నములుతూ ఉండగానే సగం అరగాలి కాబట్టి టీవీ, మీడియా ప్రభావం పడకుండా ఏకాగ్రత తో నమిలి తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. మితంగా (పొట్ట లో సగ భాగం ఆహారం, పావు వంతు నీరు, పావు వంతు ఖాలీగా ఉండే టట్టు)తినాలి. మనం తినే ఆహారం రంగు, రుచిని ఆస్వాదిస్తూ తినాలి.
విహారం అంటే వినోదం. ఈ రోజుల్లో ఒత్తిడి ఒక సాధారణ అంశం అయినది. ప్రతిఒక్కరూ రోజువారీ పనులతో ఒత్తిడికిగురవుతున్నారు. కాబట్టి ఎవరికి వాారు వినోదం, విశ్రాంతి కొరకు సమయం కేటాయించుకోవాలి. కుటుంబ సమయాన్ని ఆస్వాదించడం ద్వారా కూడా మన శరీరం మరియు మనస్సుకు చైతన్యం కలుగుతుంది. మనం ఆనందించే కార్యకలాపాలలో కొంత సమయం గడపడం వల్ల కూడా మనస్సుపై ఆందోళనను తొలగిస్తుంది. మొక్కలు పెంచడం, పెయింటింగ్, సంగీత వాయిద్యాలను ప్లే చేయడం వంటి క్రియాశీల సృజనాత్మక అభిరుచులు మనస్సును రీఛార్జ్ చేస్తాయి. క్రీడలు ఆడటం శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే మరో మార్గం. రిలాక్సేషన్ వల్ల మన శరీరానికి, భావోద్వేగాలకు మరియు మన నాడీ వ్యవస్థకు సమతుల్యత ఉంటుంది . క్రమం తప్పకుండా వ్యాయామం లేదా విశ్రాంతి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆచార్ అనగా రొటీన్. రోజు ప్రణాళిక లేకుండా పోవడం మరియు రోజులో ఎక్కువ పనితో మనము ఇబ్బంది పడటం తరచుగా జరుగుతుంది. మన మానసిక , శారీరక ఆరోగ్యం మంచి నిత్యకృత్యాలపై (అచార్) ఆధారపడి ఉంటుంది. క్రమబద్ధత మరియు చిత్తశుద్ధి మంచి దినచర్య యొక్క రెండు ప్రధాన భాగాలు. రోజును ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వీయ, పని, ఆహారం, వినోదం మరియు నిద్ర కోసం అవసరమైన అన్ని పనులను చేర్చండి. మన జీవితంలో చాలా ఇబ్బందులకు పరిష్కారాలు సరైన అలవాట్లు మరియు సరైన దినచర్యలను నిర్దేశించటంలో ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు "మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కాని మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు మరియు మీ అలవాట్లు మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి" అనే వాారు.
విచార్ అనగా ఆలోచనలు. మన ఆలోచనలు మన మనసుకు ఆహారం. బుద్ధుడు ఇలా అంటాడు, “మీ ఆలోచన ఆధారంగా మీరు మీరే అవుతారు”. మీరు బలహీనంగా ఉన్నారని అనుకుంటే, మీరు బలహీనంగా ఉంటారు. మీరు బలంగా ఉన్నారని అనుకుంటే, మీరు బలంగా ఉంటారు. మన ఆలోచన ప్రక్రియను సరిగ్గా నిర్వహించుకోవాలి. ఎల్లప్పుడూ మంచి వైఖరిని పెంపొందించుకోవాలి. మంచి పుస్తకాలు, గ్రంథాలు చదవడం, పవిత్ర మంత్రాలను పఠించడం, పూర్వీకుల నుండి వచ్చిన ఆచారములు పాటించడం, మంచి అనుభవాలను గుర్తుచేసుకోవడం మరియు అన్ని పరిస్థితులలో సానుకూలంగా ఆలోచించడం ద్వారా మంచి ఆలోచన ప్రక్రియను రోజువారీ జీవితంలో చేర్చవచ్చు.
"ఆరోగ్యమే మహాభాగ్యము"
Sunday, February 14, 2021
ఓం కారం విశిష్టత
మన వేదములలో సుమారు వేలకి పై గా స్తోత్రములు చెప్పబడినవి. ప్రతి స్తోత్రం ఉచ్ఛరించడం వలన గాని, వినడం వలన గాని కలిగే ప్రయోజనం మన శరీరం, మనస్సు పై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ, మన శరీరంలో కుండలినీ శక్తి గా పిలువబడే 7 చక్రాలు శుద్ధి జరిగి శక్తి వంతమవుతాయి. శరీరంలో ప్రతి కణానికి రక్తం సరఫరా మెరుగవుతుంది.
* సృష్టి లో ఉన్న ప్రతి జీవరాశి ని సృష్టి యొక్క శక్తితో అనుసంధానం చేస్తుంది.* శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది.* ఒత్తిడిని తగ్గిస్తుంది.* రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె పని తీరు మెరుగవుతుంది.* ఏకాగ్రత తో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుంది.* శరీరంలో హార్మోన్ల ప్రభావం సమతుల్యంగా ఉంటుంది.* ఓంకారం 15 నిమిషాలు ఉచ్ఛరించడం వలన రక్తపోటు తగ్గుతుంది.
Thursday, February 11, 2021
యోగము
"యోగము" అనగా సంస్కృతంలో ఐక్యత లేక విలీనము అని అర్థము. యోగాభ్యాసం యొక్క లక్ష్యం శరీరానికి, మనస్సు కు, శ్వాస కు సమతుల్యత సాధించడం. మనలోని అంతర్గతంగా ఉన్న శక్తులను వెలికి తీసి, వాటి ప్రతిభతో జీవితమును ఉద్దీపింప చేయు ఒక సాధనము యోగ.
యోగాభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం మనస్సు పై పట్టు సాధించడమే.ఈ ఆధునిక ప్రపంచం వేగవంతమైంది. మనస్సు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉండదో , ఆందోళన, ఒత్తిడి మొదలై శరీరం మీద ప్రభావం చూపుతుంది. దానికి కావలసిన శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి పనికి వచ్చే పద్ధతులు మనకు యోగ శాస్త్రంలో లభిస్తాయి.