మన వేదములలో సుమారు వేలకి పై గా స్తోత్రములు చెప్పబడినవి. ప్రతి స్తోత్రం ఉచ్ఛరించడం వలన గాని, వినడం వలన గాని కలిగే ప్రయోజనం మన శరీరం, మనస్సు పై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ, మన శరీరంలో కుండలినీ శక్తి గా పిలువబడే 7 చక్రాలు శుద్ధి జరిగి శక్తి వంతమవుతాయి. శరీరంలో ప్రతి కణానికి రక్తం సరఫరా మెరుగవుతుంది.
మన విశ్వం లో మొదట పుట్టిన శబ్దం "ఓం"
ఓంకారం ఉచ్చరించ డం వలన కలిగే ప్రయోజనాలు:
* సృష్టి లో ఉన్న ప్రతి జీవరాశి ని సృష్టి యొక్క శక్తితో అనుసంధానం చేస్తుంది.* శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది.* ఒత్తిడిని తగ్గిస్తుంది.* రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె పని తీరు మెరుగవుతుంది.* ఏకాగ్రత తో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుంది.* శరీరంలో హార్మోన్ల ప్రభావం సమతుల్యంగా ఉంటుంది.* ఓంకారం 15 నిమిషాలు ఉచ్ఛరించడం వలన రక్తపోటు తగ్గుతుంది.
విదేశాల్లో అనేక యూనివర్సిటీల్లో ఓంకార నాదం పై జరిగిన పరిశోధనల్లో నాడీ వ్యవస్థ లో గల న్యూరోన్ల పని తీరు మెరుగైన ఫలితాలు కూడా ఉన్నాయి. పిల్లలతో కూడా రోజు ఉదయం ఓంకార ఉచ్ఛారణ చేయిస్తే వాళ్ళ లో చురుకు దనం పెరిగి స్కూల్ లో పాఠాలు శ్రద్ధగా నేర్చుకుని బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు.
సాధన ఎలా చేయాలి అంటే సుఖాసనం లో కాని, వజ్రాసనం లో కాని, పద్మా సనం లో కాని నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. దీర్ఘ శ్వాస తీసుకుని వదులుతూ "ఓం" అని ఉచ్ఛరించాలి.
"లోకా స్సమస్తా స్సుఖినోభవంతు"
No comments:
Post a Comment