మన శరీరంలో ఆలోచనలు దగ్గర నుండి ప్రతి క్రియ జరగడానికి మూలం ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి శరీరంలో ఉన్న 72000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ఆధారంగా నే ప్రాణం ఉంటుంది శరీరంలో. శరీరం, మనస్సు రెండింటి నీ అనుసంధానం చేసేది కూడా ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి లయబద్ధంగా పని చేస్తూ ఉంటే మిగిలిన వి అన్ని చక్కగా పని చేస్తాయి. శ్వాస ద్వారా ప్రాణశక్తిని నియంత్రించవచ్చు. శ్వాస ఆధారంగా చేసే ప్రక్రియ ప్రాణాయామము. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగ లో నాలుగవది ప్రాణాయామము. ప్రాణాయామము అనగా ప్రాణ+ ఆయమము. ప్రాణశక్తిని ఉద్దీపింప చేయడమే ప్రాణాయామము.మన శరీరంలో ఉన్న 3 ప్రధాన నాడు లు సూర్య నాడి, చంద్ర నాడి, సుషుమ్న నాడి.
ప్రాణాయామము చేయడం వలన సూర్య నాడి, చంద్ర నాడి మీద ఒత్తిడి తగ్గి సుషుమ్న నాడి ప్రవాహం మెరుగై జీవిత కాలాన్ని పెంచుతుంది. పూరకము అనగా గాలి బాగా తీసుకోవడం, కుంభకం అనగా గాలి నుండి కుంభించి ఉంచడం, రేచకము అనగా గాలిని పూర్తిగా వదిలేయడం. ఈ పూరక, కుంభక, రేచకము అనుసంధానం తో చేసేది ప్రాణాయామము.
సూర్యోదయం కాని సూర్యాస్తమయ సమయాల్లో 30 నిమిషాల సమయం వీలు చేసుకుని శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న గాలి లోపలికి తీసుకుంటున్న భావన, శ్వాస వదులుతూ మన శరీరంలో మలినాలు తో ఉన్న గాలి బయటకు వదులుతున్న భావన తో చేయాలి. ప్రాణాయామ సాధన కు ముఖ్యం గా పాటించవలసి నవి 5 నియమాలు సరైన సమయం, మంచి గాలి వెలుతురు ఉన్న ప్రదేశం, తేలికగా జీర్ణమయ్యే పోషకాహారం, సాధన చేయాలనే జిజ్ఞాస, నాడి శుద్ధి.
ప్రాణాయామ సాధన వలన కలిగే ప్రయోజనాలు:
* రక్తము శుద్ధి జరిగి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.* ఊపిరితిత్తులు, గుండె, మెదడు అన్ని అవయవముల పనితీరు మెరుగుపడుతుంది.* నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.* ఒత్తిడి తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది.* వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.* జీర్ణక్రియ మెరుగవుతుంది.
No comments:
Post a Comment